రామో విగ్రహవాన్ ధర్మః. భారతీయ సనాతనధర్మానికి మూలమైన గాథ రామాయణము. అది సీతాయాశ్చరితంమహత్. లౌకిక వాఙ్మయములో మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి అందించిన శ్రీమద్రామాయణము. ఆ కావ్యాన్ని నేర్చుకోవడం, అందులోని పరమార్థాన్ని జీవితములో కూర్చుకోవడం ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యము.