Learning Resources

Listen to and learn the lessons taught by teachers in traditional methods for the study of Sanskrit and Telugu languages ​​and literature.

16

Total Courses

300+

Total Hours

9

Expert Instructors

మొల్ల రామాయణం

తెలుగు కవయిత్రులలో ఆతుకూరి మొల్లమాంబకు విశిష్టమైన స్థానము ఉన్నది. తెలుగులో ప్రజాదరణ పొందిన రామాయణములలో ముందు వరుసలో నిలిచేది మొల్ల రామాయణము. ఆతుకూరి మొల్లమాంబ పద్యాలు కందువ మాటలతో, సరళసుందరముగా ఉంటాయి. ఈమె చేసిన నూతన కల్పనలు, నిజంగానే రామాయణములో ఉన్నాయి అన్నంత బలంగా లోకములో నాటుకుపోయాయి. అంతటి ఉదాత్తమైన భావనాశక్తి ఈమె రచనలో దర్శనమిస్తుంది. ఈ పాఠములలో మొల్ల రామాయణాన్ని అధ్యయనం చేయవలసిన విధానాన్ని సోదాహరణంగా వివరించారు. అనుభవజ్ఞులైన గురువులు కావ్యంలోని ముఖ్యమైన పద్యాలను ప్రతిపదార్థాలు,…

Mana Bhasha

April 6, 2026 8:49 pm

వాల్మీకి రామాయణము

రామో విగ్రహవాన్ ధర్మః. భారతీయ సనాతనధర్మానికి మూలమైన గాథ రామాయణము. అది సీతాయాశ్చరితంమహత్. లౌకిక వాఙ్మయములో మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి అందించిన శ్రీమద్రామాయణము. ఆ కావ్యాన్ని నేర్చుకోవడం, అందులోని పరమార్థాన్ని జీవితములో కూర్చుకోవడం ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యము.

Mana Bhasha

April 6, 2026 8:50 pm

ఎఱ్ఱన నృసింహ పురాణము

ఇది పురాణము. ప్రబంధము. ఇది అహోబల క్షేత్రమాహాత్మ్యకావ్యము. దుష్ట శిక్షణ – శిష్ట రక్షణకై అవతరించిన శ్రీ నృసింహావతార వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ‘ప్రబంధ పరమేశ్వరుడు’, ‘శంభుదాసుడు’ గా పేరుగాంచిన, కవిత్రయంలో ఒకరైన, చెదలవాడ ఎఱ్ఱాప్రగడ గారిచే రచింపబడినది. సూక్తి వైచిత్రి, వర్ణనాత్మకశైలి, ఆలంకారిక శోభలతో, ఎందరో కవుల రచనలకు మార్గదర్శకంగా నిలిచింది. నృసింహపురాణం ప్రబంధాలకు, పురాణాలకు, క్షేత్రమాహాత్మ్యకావ్యాలకు, కరదీపికగా వెలుగొందింది. ఉపపురాణంగా ప్రఖ్యాతిని పొందింది.

Mana Bhasha

April 6, 2026 8:50 pm