ఎఱ్ఱన నృసింహ పురాణము

About the Course

ఇది పురాణము. ప్రబంధము. ఇది అహోబల క్షేత్రమాహాత్మ్యకావ్యము. దుష్ట శిక్షణ – శిష్ట రక్షణకై అవతరించిన శ్రీ నృసింహావతార వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ‘ప్రబంధ పరమేశ్వరుడు’, ‘శంభుదాసుడు’ గా పేరుగాంచిన, కవిత్రయంలో ఒకరైన, చెదలవాడ ఎఱ్ఱాప్రగడ గారిచే రచింపబడినది. సూక్తి వైచిత్రి, వర్ణనాత్మకశైలి, ఆలంకారిక శోభలతో, ఎందరో కవుల రచనలకు మార్గదర్శకంగా నిలిచింది. నృసింహపురాణం ప్రబంధాలకు, పురాణాలకు, క్షేత్రమాహాత్మ్యకావ్యాలకు, కరదీపికగా వెలుగొందింది. ఉపపురాణంగా ప్రఖ్యాతిని పొందింది.

What Will You Learn in this Course?

  • భక్తి మహత్వాన్ని తెలిపే పురాణం. భక్తులను రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడని ఈ పురాణం బోధిస్తుంది. ఈ పాఠముల ద్వారా ఎఱ్ఱనగారి రచనాశైలి, భగవత్తత్త్వము, ప్రబంధ లక్షణములు, శబ్దార్థాలంకారాల ప్రయోగవిధానము, వర్ణనాత్మక కావ్య స్వరూపము గమనించవచ్చు. తదనంతర కవులపై ఎఱ్ఱనగారి ప్రభావము ఎంత ఉన్నదో అర్థమవుతుంది. నృసింహ పురాణం ద్వారా దేవుడు సర్వాంతర్యామి అని, అచంచలమైన భక్తి ముందు ఎంతటి అసుర శక్తి అయినా తలవంచక తప్పదని అర్థమవుతుంది.

Course Curriculum

Gurus for this Course