ఇది పురాణము. ప్రబంధము. ఇది అహోబల క్షేత్రమాహాత్మ్యకావ్యము. దుష్ట శిక్షణ – శిష్ట రక్షణకై అవతరించిన శ్రీ నృసింహావతార వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ‘ప్రబంధ పరమేశ్వరుడు’, ‘శంభుదాసుడు’ గా పేరుగాంచిన, కవిత్రయంలో ఒకరైన, చెదలవాడ ఎఱ్ఱాప్రగడ గారిచే రచింపబడినది. సూక్తి వైచిత్రి, వర్ణనాత్మకశైలి, ఆలంకారిక శోభలతో, ఎందరో కవుల రచనలకు మార్గదర్శకంగా నిలిచింది. నృసింహపురాణం ప్రబంధాలకు, పురాణాలకు, క్షేత్రమాహాత్మ్యకావ్యాలకు, కరదీపికగా వెలుగొందింది. ఉపపురాణంగా ప్రఖ్యాతిని పొందింది.