మొల్ల రామాయణము

About the Course

తెలుగు కవయిత్రులలో ఆతుకూరి మొల్లమాంబకు విశిష్టమైన స్థానము ఉన్నది. 

తెలుగులో ప్రజాదరణ పొందిన రామాయణములలో ముందు వరుసలో నిలిచేది మొల్ల రామాయణము. ఆతుకూరి మొల్లమాంబ పద్యాలు కందువ మాటలతో, సరళసుందరముగా ఉంటాయి. ఈమె చేసిన నూతన కల్పనలు, నిజంగానే రామాయణములో ఉన్నాయి అన్నంత బలంగా లోకములో నాటుకుపోయాయి. అంతటి ఉదాత్తమైన భావనాశక్తి ఈమె రచనలో దర్శనమిస్తుంది.  

ఈ పాఠములలో మొల్ల రామాయణాన్ని అధ్యయనం చేయవలసిన విధానాన్ని సోదాహరణంగా వివరించారు. అనుభవజ్ఞులైన గురువులు కావ్యంలోని ముఖ్యమైన పద్యాలను ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, విశేషాంశాలతో సంప్రదాయబద్ధంగా బోధించారు.

What I will learn?

  • ఈ పాఠముల వలన, రామాయణ కావ్యములోని కథాక్రమముతో పాటు, మొల్లమాంబ చేసిన ప్రత్యేకమైన కూర్పును కూడా తెలుసుకొనవచ్చు.
  • అంతేకాక మొల్ల పద్యరచనాసంవిధానము, ఆలంకారిక శోభ, చమత్కృతి మొదలైన లక్షణములను గమనించవచ్చు.
  • పాత్రోచితమైన సంభాషణలు, కథానుకూల వర్ణనలు, రసపోషణ ఏవిధంగా ఆవిష్కరించి కావ్యమును పరిపుష్టము చేసారో తెలుసుకొనవచ్చు.
  • ఈ పాఠముల వలన మొల్లరామాయణమును పూర్తిగా అధ్యయనము చేయగల సామర్థ్యము కలుగుతుంది.
This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.