తెలుగు కవయిత్రులలో ఆతుకూరి మొల్లమాంబకు విశిష్టమైన స్థానము ఉన్నది.
తెలుగులో ప్రజాదరణ పొందిన రామాయణములలో ముందు వరుసలో నిలిచేది మొల్ల రామాయణము. ఆతుకూరి మొల్లమాంబ పద్యాలు కందువ మాటలతో, సరళసుందరముగా ఉంటాయి. ఈమె చేసిన నూతన కల్పనలు, నిజంగానే రామాయణములో ఉన్నాయి అన్నంత బలంగా లోకములో నాటుకుపోయాయి. అంతటి ఉదాత్తమైన భావనాశక్తి ఈమె రచనలో దర్శనమిస్తుంది.
ఈ పాఠములలో మొల్ల రామాయణాన్ని అధ్యయనం చేయవలసిన విధానాన్ని సోదాహరణంగా వివరించారు. అనుభవజ్ఞులైన గురువులు కావ్యంలోని ముఖ్యమైన పద్యాలను ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, విశేషాంశాలతో సంప్రదాయబద్ధంగా బోధించారు.
